హీరోయిన్ మెహ్రీన్ ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ అనే సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది.నాని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.మహానుభావుడు,రాజా ది గ్రేట్ సినిమాలతో హాట్రిక్ కొట్టిన ఈ భామకు తరువాత హిట్లు లేక అవకాశాలు తగ్గాయి.మధ్యలో ఒకటీ అరా సక్సెస్ లు వచ్చినా.. ఆమెని టాప్ రేంజ్ లో నిలబెట్టలేకపోయాయి. రిజ్వాన్ ఫిల్మ్ సంస్థ సుధీర్ బాబుతో ఓ సినిమా చేయాలనుకుంది. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు. రూ.30 లక్షలు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.
కానీ ఆ సినిమా నుండి సుధీర్ బాబు తప్పుకున్నాడు. దీంతో సుధీర్ బాబు స్థానంలోకి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ వచ్చి చేరాడు.కళ్యాణ్ దేవ్ హీరో అయితే సినిమా చేయనంటుంది.కళ్యాణ్ దేవ్ పక్కన నేను చేయనని మొరాయిస్తుందట. సుధీర్ బాబు హీరో అని చెప్పి ఇప్పుడు హీరోని మార్చి నటించమంటే ఎలా అంటూ నిర్మాతలతో గొడవకి దిగిందట.నిర్మాతలు కళ్యాణ్ దేవ్నే హీరోగా పెడదామని ఫిక్స్ అయ్యారట.దీంతో నిర్మాతలతో గొడవ పడి ఆ సినిమా నుంచి మెహ్రీన్ తప్పుకుందని తెలుస్తుంది.