హీరోయిన్ స్వాతి అంటే పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు కాని , కల్లర్స్ స్వాతి అంటే అందరికి ఠక్కున గుర్తుకు వస్తోంది. మా టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే కల్లర్స్ ప్రొగ్రామ్కు యాంకరింగ్ చేసింది స్వాతి. ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు రావడంతో బుల్లితెర నుంచి వెండితెర మీదకు షిఫ్ట్ అయింది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే స్వాతి తెలుగులో కన్నా తమిళంలోను ఎక్కువ సినిమాల్లో నటించింది.
ఆ తరువాత ప్రేమించిచ వ్యక్తిని వివాహం చేసుకుని తన వైవాహిక జీవితాన్ని హాయిగా గడుతుతోంది. అయితే స్వాతికి మళ్లీ నటించాలని ఉందట.దీనికి ఆమె కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెండితెర మీద రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది స్వాతి. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాలో హీరోయిన్గా నటించింది స్వాతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారట.
మొదటి పార్ట్కు దర్శకత్వం వహించిన చందూ మొండేటి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్వాతి మెయిన్ హీరోయిన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నప్పటికి స్వాతి చూట్టునే కథ తిరుగుంతుందట. ఈ కారణంతోనే కార్తీకేయ -2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట స్వాతి. కార్తీకేయ -2 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న స్వాతి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.
- Advertisement -
రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ స్వాతి…హీరో ఎవరో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -