Friday, March 29, 2024
- Advertisement -

ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న ఏమ‌న్నారంటే…?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ప‌రువు హ‌త్య‌ను ఇప్ప‌టికే రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఖండిస్తున్నారు. సినీ సెల‌బ్రిటీలు కూడా ఈ ప‌రువు హ‌త్య‌పై ఘాటుగా స్పందించారు.తాజాగా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న స్పందించారు.

కొండంత ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణయ్‌ను అన్యాయంగా చంపడం దారుణమని పేర్కొన్నారు. ఈ పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఒకరి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ సమాజం ఎటు పోతోందని..ఈ కాలంలోనూ పరువు హత్యలు జరగడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అమృత వర్షిణితో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

కులపిచ్చి అనాగరికమని ఓ భావోద్వేగ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మంచు మనోజ్. కులాన్ని, మతాన్ని సమర్థించే వారంతా ప్రణయ్, అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న జుగుప్సాకరమైన దాడులకు బాధ్యత వహించాలన్నారు. మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి అంటూ రామ్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -