తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరువు హత్యను ఇప్పటికే రాజకీయ ప్రముఖులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ పరువు హత్యపై ఘాటుగా స్పందించారు.తాజాగా రామ్ చరణ్, ఉపాసన స్పందించారు.
కొండంత ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణయ్ను అన్యాయంగా చంపడం దారుణమని పేర్కొన్నారు. ఈ పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఒకరి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ సమాజం ఎటు పోతోందని..ఈ కాలంలోనూ పరువు హత్యలు జరగడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అమృత వర్షిణితో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Sad times. Where r we going. #lovehasnoboundaries #justiceforpranay #RamCharan pic.twitter.com/2C4iVRgsTW
— Upasana Konidela (@upasanakonidela) September 18, 2018
కులపిచ్చి అనాగరికమని ఓ భావోద్వేగ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంచు మనోజ్. కులాన్ని, మతాన్ని సమర్థించే వారంతా ప్రణయ్, అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న జుగుప్సాకరమైన దాడులకు బాధ్యత వహించాలన్నారు. మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి అంటూ రామ్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.