Saturday, April 20, 2024
- Advertisement -

శివాజీ రాజాకు కౌంటరిచ్చిన హైపర్ ఆది

- Advertisement -

జబర్థస్త్ ద్వారా చాలామంది నటులు వెలుగులోకి వచ్చారు. వారిలో హైపర్ ఆది కూడా ఒకడు. సాధారణంగానే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన హైపర్ ఆది , ఎప్పటికప్పుడు పవన్ పై తనకున్న ప్రేమను చాటుకుంటునే ఉన్నాడు. పవన్ పెట్టిన పార్టీ జనసేన తరుపున ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు హైపర్ ఆది. దీనిలో భాగంగానే హైపర్ ఆది వైసీపీ , టీడీపీ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నటుడు శివాజీ రాజా నిన్న(ఆదివారం) మెగా బ్రదర్ , జబర్థస్త్ జడ్టీ , జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థీ నాగబాబు గురించి మీడియా మాట్లాడారు.

నాగబాబు అడుక్కునేవాడికి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయడని, అలాంటి వ్యక్తికి ఒక్కరు కూడా ఓటు వేయవద్దని ప్రజలను కోరాడు శివాజీ రాజా. నాగబాబు, శివాజీ రాజాకు మధ్య మా ఎన్నికల సమయంలో గొడవలు జరిగిన సంగతి అందరికి తెలిసిందే. దీంతోనే శివాజీ రాజా ఇలా నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని అనుకుంటున్నారు. శివాజీ రాజా నాగబాబుపై కామెంట్స్ చేయడంపై హైపర్ ఆది స్పందించాడు.ఎవరి భిక్షంపై రెండేళ్లు ‘మా’అధ్యక్షుడిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించాడు. ఎవరి పని వాళ్లు చూసుకోవాలని, కుక్క పనిని గాడిద చేస్తానంటే కుదరదని పేర్కొన్నాడు.

నాగబాబు గురించి ఆయన చెప్పినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదన్నాడు. చిరంజీవి అంటే తనకిష్టమన్న శివాజీ రాజా అదే నోటితో నాగబాబును తిట్టడం తమకు నచ్చదన్నాడు. నాగబాబు పిల్లికి భిక్షం పెట్టడని అనడం సరికాదని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒకరికి మూత్రపిండం పాడైతే ఆపరేషన్ కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని హైపర్ ఆది గుర్తు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -