తెలుగులో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత మంచి కమర్షియలు సినిమాలు చేసి ఓ పదేళ్లు టాలీవుడ్లో రెచ్చిపోయింది. ఇప్పుడు ఈ హీరోయిన్ టాలీవుడ్కు టాటా చెప్పేసి బాలీవుడ్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా కనిపించడం లేదు. అయితే ఈ బ్యూటీకి మాత్రం ఓ మంచి అవకాశం వచ్చి పడింది. అదే ఆమె ఓ దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమాకం కావడం ఆశ్చర్యమేస్తోంది.
ఫిజీ దేశ పర్యాటక రంగం తరఫున ప్రచారం చేయడానికి ఇలియానాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఈ విషయాన్ని ఇలియానానే ప్రకటించి ఆనందం వ్యక్తం చేసింది. ‘అందాల దేశం ఫిజీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. వారి ఆతిథ్యం, ప్రేమ నాకు సొంతింటిలో ఉన్న అనుభూతి కలిగించింది. ఇంకా చాలా ప్రదేశాలు చూసిన తరవాత తిరిగి రావడం గురించి ఆలోచిస్తా’ అని ఇలియానా పేర్కొంది. అయితే ఈ విషయమై ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడారు.
‘భారతీయ పండుగలు దీపావళి, వినాయక చవితిని కూడా జరుపుకుంటాం. ఇలియానా బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంతో ఇంకా మా దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఫిజీ పర్యాటక శాఖ మంత్రి ఫయాజ్ సిద్ధిఖీ కోయ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఫిజీ దేశంపై ఆసక్తి ఏర్పడింది. వాస్తవంగా భారత్, ఫిజీల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంలో దాదాపు 38 శాతం ప్రజలు భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. ఫిజీలో భారతీయులు ఎక్కువ సంఖ్య పర్యటిస్తుంటారు. ఈ విధంగా విదేశాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చాలామంది సినీనటులు ఉన్నారు. గతంలో ఆస్ట్రేలియాకు పరిణితీ చోప్రా, న్యూజిలాండ్కు సిదార్థ్ మల్హోత్రా తదితరులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.
https://www.adya.news/telugu/gallery/shama-sikander-bikini-images/