Saturday, April 20, 2024
- Advertisement -

తారక్ పై తప్పుడు ప్రచారం

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య తారక్ ఎక్కువ గా బయటకు రాకపోవడం తో హీరో మీద అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ సినిమా పరిశ్రమ కి మాత్రమే లిమిట్ అయ్యి ఉంటె బాగుంటుంది కానీ ఎందుకో ఏమో ఈ మధ్య తారక్ పేరు ఎక్కువగా రాజకీయాల్లో వినిపిస్తుంది. తారక్ ఇక పై తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపడతాడు అని కొందరు ప్రచారం చేస్తుంటే, మరి కొందరు వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం తరపున తారక్ ముఖ్యమంత్రి కాండిడేట్ అని అంటున్నారు. అయితే దీని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు.

అయితే ఈ మధ్య ఎక్కువ గా వినిపించిన రూమర్స్ లో ప్రధానం గా అందరికీ తెలిసింది తారక్ ని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ ని చేస్తున్నారు అని. అయితే వైస్సార్సీపీ నాయకులు తారక్ పేరు ని ఇలా వాడుకుంటున్నారు అని కొంతమంది ముందు నుంచి చెప్తున్నా తారక్ తరపు వాళ్ళు మాత్రం మౌనం గా ఉండిపోయారు.

అయితే మొత్తానికి ఇటీవలే ఈ విషయమై క్లారిటీ ఇస్తూ కొంత మంది తారక్ సన్నిహితులు అభిమానులని ఇలాంటి వార్తలు నమ్మొద్దు అని సూచన చేశారు. ఇప్పుడు అప్పుడే తారక్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం లేదు అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -