Thursday, April 25, 2024
- Advertisement -

అమ్మాయిగా మారిన తర్వాత నరకం చూశా : జబర్దస్త్ కమెడియన్

- Advertisement -

జబర్దస్త్ షో నుంచి వచ్చిన ధన్ రాజ్, షకలక శంకర్, హైపర్ ఆది, మహేష్ వంటి వారికి మంచి గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ ఎంతగా క్లిక్కయినా అప్పుడప్పుడు ఆ షో వివధాల్లోకి వెళుతూనే ఉంది. ఇక వివాదాలతో ఫేమస్ అయిన వారిలో సాయి తేజ ఒకరు. మొదట్లో అబ్బాయిగా ఉన్నా ఆ తరువాత ప్రియాంక సింగ్ అంటూ అమ్మాయిలా మారింది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ షోలో అడుగు పెట్టిన తరువాత సాయి తేజగా అందరికి తెలిసినప్పటికి చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిలా ఉండడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాను. ఐదేళ్ల వయసు నుంచే ఎవరికి తెలియకుండా అక్క బట్టలు వేసుకున్నాను. ఆ తరువాత చీర కూడా కట్టుకున్నా. ఆ తరువాత కొన్నేళ్లకు సొంత నిర్ణయంతోనే నా జీవితాన్ని ఇష్టం ఉన్నట్లు కొనసాగించాలని అనుకున్నాను. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి చాలా కష్టపడ్డాను.

సర్జరీ అయిపోయిన తరువాత 9 నెలల పాటు నరకం చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు కేవలం స్నేహితులు మాత్రమే అండగా నిలిచారు. అమ్మానాన్నలకు ఈ విషయం తెలియదు. కానీ నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మాయిగా మారడానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. నేను సంపాదించిన డబ్బుతోనే సర్జరీ చేయించుకున్నానని ఈ కమెడియన్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -