Wednesday, April 24, 2024
- Advertisement -

జబర్దస్త్ నరేష్ కు వార్నింగ్ ఇచ్చిన రోజా..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోకు ఉన్న పాపులారిటీ మరో షోకు లేదు. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. వారంతా ఇప్పుడు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకడు. తాజాగా అతడు ఏపీ సీఎంను అనుకరించి రచ్చ రచ్చ చేశాడు. జబర్ధస్త్ నరేష్‌ మూడు అడుగులు మాత్రమే ఉంటాడు. కానీ, అతడిలోని టాలెంట్ మాత్రం లెక్కించలేరు. బుల్లితెరపై నరేష్‌కు బాగా డిమాండ్ ఉంది. జబర్దస్త్ లో చేస్తునే బుల్లితెరపై మరికొన్ని షోస్ లో చేస్తున్నాడు నరేష్.

దీంతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక, రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని మల్లెమాల సంస్థ ‘అమ్మా నాన్న ఓ సంక్రాంతి’ అనే స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు. తాజా ఇందుకు సంబందించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో ఆర్టిస్టులకు, వాళ్ల పిల్లలకు మధ్య పోటీని ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దల మధ్య వచ్చే పోటాపోటీ ప్రదర్శనలతో ఈ షో ఉండనుంది.

ఇందులో రోజా సహా జబర్ధస్త్ ఆర్టిస్టులు, యాంకర్లు, సింగర్లు పాల్గొన్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా యాంకర్ ప్రదీప్ పిల్లలకు, పెద్దలకు మధ్య సమావేశాలు నిర్వహించాడు. ఇందులో నరేష్ తన తండ్రిపై కంప్లైంట్ చేశాడు. ఆ టైంలో తన తండ్రిని ఉద్దేశించి ‘కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరిక్కడ’ అంటూ డైలాగ్ చెప్పి రచ్చ చేశాడు. కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇలాంటి డైలాగే చెప్పిన విషయం తెలిసిందే.

ఇదే డైలాగ్ ను నరేష్ రెండు మూడు సార్లు చెప్పగా.. రోజా నవ్వుకుంటూ అతడి మీదికి దూసుకొచ్చింది. అప్పుడు నరేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. దీంతో ఆమె నరేష్‌కు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు కళ్లు పెద్దవి చేసి చూశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -