Friday, April 26, 2024
- Advertisement -

రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన జగన్..!

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ’కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ సినిమాపై వస్తున్న వివాదాలు అన్ని ఇన్ని కావు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఈ సినిమాని తెరకెక్కించాడు వర్మ. అయితే ఈ సినిమాని ఈ రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినప్పటికి సెన్సార్ కానీ కారణంగా వాయిదా పడిండి.

ఇక ’కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తనను కించపరిచారని కేఏ పాల్ కోర్టుకు వెళ్లారు. దాంతో ఈ సినిమాని చూసి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కోర్టు తెలిపింది. ఇప్పుడు మరో వివాదం వచ్చి పడింది. ఈ సినిమా టైటిల్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని.. వెంటనే టైటిల్ మార్చాలని కొందరు హైకోర్టుకెక్కారు. ఇలా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్న వర్కకు తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ నుంచి షాక్ తగిలింది. ’కమ్మ రాజంలో కడప రెడ్లు’ పేరు మార్చాలని తాజాగా జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రీజనల్ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాయడం కలకలం రేపింది.

కులాల మధ్య గొడవలు జరిగేలా ఈ టైటిల్ ఉందని.. వెంటనే మార్చాలని కోరారు. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వర్మ.. జగన్ పై ప్రేమతో ఈ చిత్రంను తీశాడు. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఈ సినిమాపై అభ్యంతరం తెలుపడం హాట్ టాపిక్ అయింది. ఇక హైకోర్టు సూచన.. జగన్ సర్కార్ అభ్యంతరాల క్రమంలో ఈ సినిమా టైటిల్ ను ’అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా మారుస్తానంటూ వర్మ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -