Thursday, April 25, 2024
- Advertisement -

రాతియుగం నాటి కాజల్…

- Advertisement -

హిట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ఈమె శర్వానంద్ తో సరసన హీరోయిన్ గా నటించిన ‘రణరంగం’ సినిమా ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. మరోవైపు తమిళ్ క్వీన్ ‘ప్యారిస్ ప్యారిస్’ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే అంతేకాకుండా జయం రవి సరసన కోమలి అనే సినిమాలో కూడా కాజల్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా పోస్టర్లు ప్రస్తుతం కోలీవుడ్ లో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ సినిమా నుంచి కాజల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అందులో రాతియుగం నాటి మహిళగా కనిపిస్తోంది కాజల్. జయం రవి సినిమా కోసం తొమ్మిది అవతారాల్లో నటించాడని కానీ అందులో నాలుగు మాత్రమే సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఆడమ్ అండ్ ఈవ్ నుంచి మొదలై ఇప్పటిదాకా మానవ పరిణామం ఎలా మారింది అని సినిమా చూపిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కాజల్ అగర్వాల్ రాతియుగం నాటి అమ్మాయి అవతారంలో కనిపిస్తుంది. అలాంటి లుక్ లో కూడా కాజల్ అగర్వాల్ చాలా అందంగా ఉండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -