Thursday, April 25, 2024
- Advertisement -

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో కమల్ హాసన్

- Advertisement -

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996 లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా సీక్వెల్ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మళ్లీ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో ‘భారతీయుడు-2’ అనే టైటిల్ తో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని మళ్ళీ మొదలు పెట్టారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యనే షూటింగ్ లోని మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమా రెండవ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారట. రెండవ షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరగనుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడ జరగనుంది. కోర్ నటీనటులతో పాటు వెన్నెల కిషోర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సిద్ధార్థ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా 2021లో విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -