కమల్ హాసన్ నటుడిగా ఎంత గొప్ప వ్యక్తి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. తెలుగు, తమిళ భాషలు మాత్రమే కాకుండా కమల్ హాసన్ సినిమా వస్తుంది అంటే భారత దేశం లో ఉన్న సినిమా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తారు. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే ఆయన రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకి సేవ చేద్దాం అని అనుకున్నారు కానీ ఏమైందో ఏమో కానీ అది సరిగా అవ్వలేదు. ఆయన ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయారు. కాకపోతే ఒక్కోసారి కమల్ హాసన్ ప్రవర్తించే తీరు అందరినీ ఎంతగానో బాధిస్తుంది. కాశ్మీర్ విషయం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశం మొత్తం హర్షిస్తుంటే కమల్ మాత్రం వ్యతికరేకించాడు. వ్యతిరేకత కి కారణం చెప్తూ, ఆ ప్రక్రియ అమలు పరిచిన విధానం తనని బాధ కి గురిచేసింది అని వాపోయాడు.
అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ నిర్మాత పీ వీ పీ కూడా తన ట్విట్టర్ లో కమల్ హాసన్ కి కౌంటర్ వేశారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న కమల్ హాసన్, ఒకప్పుడు తన పక్క రాష్ట్రం విడిపోతున్న సమయం లో ఎందుకు మౌనం గా ఉండిపోయారు అని ప్రశ్నించారు.
దీనికి కమల్ హాసన్ కానీ ఆయన అభిమానులు కానీ సమాధానం చెప్తారేమో చూడాలి.