ఇండియన్ సినిమాల్లో ఎక్కువుగా బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, క్రీడకారులు, సినిమా వాళ్ల జీవితలను వెండితెర మీద చూపించారు. ప్రస్తుతం ఇండియాలో ఎన్నికల హడావిడి నడుస్తుంది. దీంతో మరో రాజకీయ నాయకురాల బయోపిక్ వెండితెర మీద చూపించబోతున్నారు. తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు అయిన జయలలిత జీవితాన్ని ఎప్పటి నుంచో సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ బయటికి వచ్చింది. జయలలిత బయోపిక్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించనుందని సమాచారం. కంగనా ఇటీవలే మణికర్ణిక సినిమాతో తానేంటో నిరుపించుకుంది. ఆమె అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. ‘తలైవి’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను జీవీ ప్రకాష్ చేశాడు. తమిళనాడు ప్రజలు జయలలితను . తలైవిగా పిలుచుకుంటారు.
దీంతో సినిమా టైటిల్ను కూడా అదే ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు అమలాపాల్ మాజీ భర్త విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు. ఈ రోజు కంగనా పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. మణికర్ణికగా మెప్పించిన కంగనా , జయలలితగా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
- Advertisement -
జయలలిత బయోపిక్లో బాలీవుడ్ వివాస్పద హీరోయిన్ ఫిక్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -