హీరోయిన్ పూజా గాంధీ గుర్తుందా..? ఆమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు కాని మనిషిని చూస్తే మాత్రం ఠక్కున గుర్తు పడతారులేండి. అదేనండి సూపర్ హిట్ సినిమా ‘దండుపాళ్యం’ సినిమాలో నటించింది పూజా గాంధీ. ఈ సినిమాతోనే లైఫ్లైన్లోకి వచ్చింది. అంతకముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా ఫేమస్ కాలేదు. కాని దండుపాళ్యం సినిమాలో ఆమె నటన, అందాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి.
దీంతో ఈ భామకు వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాలతో పాటు వివాదాలు కూడా ఈ భామను వెంటాడుతున్నాయి. తాజాగా పూజా గాంధీ బిల్లు కట్టకుండా హోటల్ నుంచి పారిపోయారని తెలుస్తోంది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్లో ఆమె కొన్ని రోజులు బస చేశారట. హోటల్ బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యింది. ఆ విషయం తెలుసుకున్న ఆమె బిల్ పూర్తిగా కట్టకుండానే అక్కడి నుంచి పరారైందట. దీంతో హోటల్ యాజమాన్యం ఆమెపై స్థానిక పోలీసుకలకు ఫిర్యాదు చేశారట. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే ఈ విషయంలో పూజా గాంధీ వాదన మరోలా ఉంది.
తాను రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నారు. మొత్తం డబ్బు చెల్లించేందుకు కాస్త టైమ్ ఇవ్వమని హోటల్ మేనేజ్మెంట్ ని ఆమె కోరినట్లు సమాచారం. బిల్లు కట్టడానికి పోలీసులు, హోటల్ యాజమాన్యం ఆమెకు కొంత సమయం ఇచ్చారని తెలుస్తోంది. పూజా గాంధీకి వివాదాలు ఏమి కొత్త కాదు. గతంలో కూడా అనే వివాదాలను కొనితెచ్చుకుంది.2011లో ఆమె ప్రముఖ నిర్మాత కిరణ్తో గొడవ పెట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
- Advertisement -
బిల్లు కట్టలేక హోటల్ నుంచి పారిపోయిన హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -