గతంలో పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసాడు నటుడు, దర్శకుడు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్. తాజాగా అయన మరోసారి పవన్ పై మండిపడ్డారు. తాజాగా ఏపీ రాజధాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని పులివెందులకు తరలించుకొండి.. హైకోర్టు కర్నూలుకు తీసుకెళ్ళండి.. మీకు కోర్టుకు వెళ్ళడానికి ఖర్చు తగ్గుతుంది అంటూ జగన్ ఉద్దేశించి కామెంట్స్ చేసాడు.
పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి కత్తి మహేష్ కౌంటర్లు ఇచ్చాడు. ఈ మేరకు పేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఏరా పవన్ కళ్యాణ్ అని ఆయన సంభోదిస్తూ రచ్చ రచ్చ చేసాడు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ‘‘ఏరా పవన్ కళ్యాణ్… పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!’’ అని కత్తి మహేశ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు.
ఇదేం భాష కత్తి.. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని కొందరు అడిగితె.. కత్తి మహేశ్ మాత్రం.. పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించిన బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు.