Tuesday, March 19, 2024
- Advertisement -

హీరోయిన్ ను పొగడ్తలతో ముంచేసిన భాయ్!

- Advertisement -

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు నటి నటులు రిలేషన్ షిప్స్ కి సంబంధించి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అలా చాలా వరకు వచ్చిన వాటిల్లో నిజమైనవే ఎక్కువ. చాలా వరకు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనేది ఎంత వాస్తవమో ఆ తరువాత వాళ్ళు విడిపోయి వేరు వేరు గా కలిసి ఉన్న విషయం కూడా అంతే వాస్తవం. అయితే కొద్ది సంవత్సరాల క్రితం అటు సల్మాన్ ఖాన్ ఇటు కత్రినా కైఫ్ తమ మధ్య ఉన్న మనస్పర్ధలు కాదు అనుకోని సినిమాలలో నటించడం కూడా ప్రారంభించారు. అలా వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన చిత్రమే టైగర్ జిందా హై. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి తెర మీద భారత్ అనే సినిమా కోసం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఈ సినిమా జూన్ 5 న విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం ఊపు అందుకున్నాయి. ముందుగా ఈ సినిమా లో ప్రియాంక చోప్రా ని హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్న దర్శకనిర్మాతలు చివరి నిమిషం లో ప్రియాంక ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం తో వెంటనే కత్రినా కైఫ్ ని అప్రోచ్ అయ్యారు. సల్మాన్ ఖాన్ తో ఉన్న పరిచయం దృష్ట్యా కత్రినా కైఫ్ కూడా వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది.

అయితే ఈ సినిమా లో జింద అనే పాట విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సల్మాన్, కత్రినా సినిమా గురించి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ పెర్ఫార్మెన్స్ గురించి సల్మాన్ ఖాన్ ని అడగగా కత్రినా కైఫ్ ఈ సినిమా లో నేషనల్ అవార్డ్ పొందే రేంజ్ లో తన పెర్ఫారమెన్స్ ని ఆందినించింది అని అందరూ షాక్ అయ్యేలా స్టేట్మెంట్ ఇచ్చాడు.

సినిమా విడుదల అయ్యేవరకు మనకి సల్మాన్ మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -