తెలుగు రియాల్టీ బిగ్బాస్ రెండో సీజన్ ద్వారా లైఫ్ లైన్లోకి వచ్చింది భాను శ్రీ.అంతకముందు భాను శ్రీ అంటే పెద్దగా ఎవరికి తెలియదు ,కాని బిగ్బాస్లో పాల్గొనడం ద్వారా బాగానే ఫేమస్ అయింది. భాను శ్రీ కూడా అందరికి లాగే కౌశల్తో గొడవ పెట్టుకోవడం వల్లే బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చింది.కౌశల్ మద్దతుగా ఏర్పడిన కౌశల్ ఆర్మీ భాను శ్రీని ఎలిమినేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి బయటికి వచ్చిన భాను శ్రీ మంచి అవకాశాలే దక్కించుకుంది.పలు టీవీ షోలకి యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి.
ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షోకి యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది.బుల్లితెర మీద ఢీ ప్రొగ్రాం హిట్ అయినంతగా మరో ప్రొగ్రాం హిట్ కాలేదు అంటే ప్రేక్షకులు ఈ షోని ఎంతలా ఇస్టపడుతున్నారో అర్థం చేసుకోవాలి.ఈ షో ఇంతటి హిట్ కావడానికి ముఖ్య కారణం సుధీర్,రష్మీ,ప్రదీప్. సుధీర్,రష్మీ లవ్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు అలవాటుపడ్డారు.అయితే సడన్గా కొత్త సీజన్లో రష్మీని కాదని టీమ్ లీడర్గా భాను శ్రీని తీసుకుని షోక్ ఇచ్చారు ఢీ యాజమాన్యం.ఢీలో భాను శ్రీని తీసుకోవడం ప్రేక్షకులకి కూడా నచ్చలేదు. సుధీర్ని డామినేట్ చేయలని భాను శ్రీ చేసిన ఓవర్ యాక్టింగ్ను ప్రజలు చూడలేకపోయారు. దీంతో యూట్యూబ్లో భాన శ్రీకి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు.పైగా షోకి రేటింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఢీ షోకి ఎప్పుడు రాని నెగిటివ్ కామెంట్స్ రావడంతో ,దీని నుంచి బయటపడలని భావించిన ఈ టీవీ యాజమాన్యం షో నుంచి భాను శ్రీని తప్పించి ,వెంటనే రష్మీని తీసుకోవడం జరిగింది.
అసలు భాను శ్రీ మీద నెగిటివ్ రావడానికి కారణం బిగ్బాస్లో ఆమె ప్రవర్తనే అని తెలుస్తుంది.కౌశల్తో భాను శ్రీ ప్రవర్తన ఏం బాలేదు.పైగా తేజస్వితో కలిసి భాను కౌశల్ను చేడుగా చూపించాలనే ప్రయత్నం చేసింది.బిగ్బాస్లో చూపించిన ప్రవర్తన కారణంగానే భాను శ్రీ ఢీ లాంటి అద్భుత షోని వదిలి వెళాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.ఇక భాను శ్రీపై నెగిటివ్ పబ్లిసిటీ చేయడంలో కౌశల్ ఆర్మీ ఇక్కడ కూడా బాగానే సక్సెస్ అయింది.ఢీ షోలో ఎప్పుడు అయితే భాను శ్రీ కనిపించిందో.అప్పటి నుంచి షోపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.మాకు రష్మీ కావాలి.భాను వద్దు,ఆమె యాంకరింగ్ బాలేదని కామెంట్స్ యూట్యూబ్లో ఎక్కువుగా కనిపించాయి.ఇదే సమయంలో జై కౌశల్ ,డౌన్ డౌన్ భాను అనే కామెంట్స్ కూడా ఎక్కువైయ్యాయి.అసలు ఈ గోల అంత ఎందుకని భాను శ్రీని తప్పించి ,రష్మీని తీసుకున్నారు ఈ టీవీ యాజమాన్యం.ఇక ఈ వారం నుంచి వచ్చే ఢీ ప్రొగ్రామ్లో రష్మీ సందడి చేయనుంది.