Thursday, April 25, 2024
- Advertisement -

స్పెయిన్ చెక్కేసిన మహానటి

- Advertisement -

మహానటి సినిమా విజయం తర్వాత నటి కీర్తి సురేష్ తన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ని చూపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాది లో ఉన్న అగ్ర కథానాయికల్లో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఒకరు అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. చాలా రోజుల బ్రేక్ తర్వాత తెలుగు లో కీర్తి ఒప్పుకున్న చిత్రం కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది. కీర్తి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు నరేంద్రనాథ్. మహేష్ కోనేరు నిర్మాత.

అటు నాగార్జున తో మన్మధుడు 2 లో కూడా నటిస్తున్న కీర్తి, ఇటీవలే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ సినిమా కోసం స్పెయిన్ చేరుకుంది. నాగార్జున తో నటిస్తుంది అనే విషయాన్ని మొదటి రోజు షూట్ లో చేరే వరకు ఎవరికీ చెప్పకుండా బాగా దాచిపెట్టారు దర్శక నిర్మాతలు. ఆ సినిమా కోసం కీర్తి చాలా బారువు కూడా తగ్గింది.

ఇక కీర్తి సినిమా విషయానికి వస్తే, దాదాపు గా 50 మంది ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ తో యూరోప్ లో వెయ్యి కిలోల లగేజ్ మరియు ఫిలిం మేకింగ్ ఎక్విప్మెంట్ తో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షెడ్యూల్ రేపటి నుండి మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -