Friday, March 29, 2024
- Advertisement -

బ‌రువు త‌గ్గిన ‘సావిత్రి’ భామ‌

- Advertisement -

సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌డం హీరోలు, హీరోయిన్లు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అల‌నాటి న‌టి ‘సావిత్రి’ జీవిత క‌థ నేప‌థ్యంలో న‌టిస్తున్న ఓ హీరోయిన్ బ‌రువు త‌గ్గారు. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కీర్తి సురేశ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో ‘సావిత్రి’ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా కోసం కీర్తి తెగ క‌ష్ట‌ప‌డుతోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గిందంట‌. ఈ విష‌యాన్ని కీర్తినే స్వ‌యంగా ప్రకటించింది.

మహానటి సినిమాకు సంబంధించి సావిత్రిలోని నెగిటివ్ అంశాలు చూపించడం లేదంటున్న కీర్తిసురేష్.. ఈ పాత్ర కోసం బరువు పెరగడం లేదని స్పష్టంచేసింది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై ‘మ‌హాన‌టి’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శాలిని పాండే, దుల్క‌ర్ స‌ల్మాన్‌ త‌దిత‌రులు వివిధ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా గురించి ప‌లు విష‌యాలు కీర్తి మాట్లాడింది.

“నిజానికి నేను బరువు తగ్గాను. యంగ్ సావిత్రి కోసం నాజూగ్గా తయారవుతున్నా. ఇక సావిత్రి కెరీర్‌లో చివరి దశ కోసం కాస్త లావుగా కనిపించేందుకు ప్రోస్తటిక్స్ వాడుతున్నాం. సావిత్రి జీవిత చరిత్ర అనగానే చాలామంది ఆమె ఎలా తాగుడుకు బానిసైంది, ఎంత బరువెక్కింది లాంటి అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. కానీ సావిత్రి గురించి చెప్పడానికి అంతకుమించి ఉంది.”

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -