ఇండియన్ సినిమాల్లో బాహుబలి సినిమా తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న సినిమా KGF. ఈ సినిమాకు యష్ అనే హీరో ఒకరు ఉండేవారని కూడా ఎవ్వరికి పెద్దగా తెలియదు. ఒక్క సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు యష్. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ,హిందీ భాషలలో విడుదల చేశారు. గొప్ప కథ కాకపోయినప్పటికి టేకింగ్తో సినిమాను నడింపించిన విధానం అందరికి నచ్చింది. దీంతో సినిమా బ్లాక్ బ్లాస్టర్గా నిలిచింది. కన్నడ సినిమాలు 50 కోట్లు సాధిస్తే గొప్ప అనుకునే వారు. కాని ఈ సినిమా ఏకంగా 230 కోట్లు సాధించి ఆల్టైమ్ రికార్డుగా నిలిచింది. KGF తెలుగులోనే 30 కోట్ల వరకు సాధించింది. ఇక బాలీవుడ్లో కూడా KGF తన సత్తాను చాటింది.
అక్కడ 70 కోట్లు సాధించి బాలీవుడ్ బడా స్టార్స్కు సైతం షాకిచ్చింది. తాజాగా ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది.50 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి కన్నడ థియోటర్లలో ఇంకా ఈ సినిమా సందడి చేస్తునే ఉంది. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా పెట్టారు. ప్రస్తుతం KGF రెండో పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. రెండో పార్ట్ను కూడా అద్భుతంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక – నిర్మాతలు. రెండో పార్ట్లో బాలీవుడ్ స్టార్స్తో పాటు , తెలుగు, తమిళ నటులను తీసుకుని సినిమాకు హైప్ తీసుకురావాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను KGF రెండో పార్ట్లో తీసుకున్నారని సమాచారం. బాహుబలిలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ కూడా రెండో పార్ట్లో కనిపించనుందని తెలుస్తోంది.
- Advertisement -
ఆల్టైమ్ రికార్డు సృష్టించిన KGF
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -