Friday, April 26, 2024
- Advertisement -

మా దారిలో బురద గుంతలు ఎక్కువ: కియారా

- Advertisement -

ప్రస్తుతం అటు బాలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని సమానం గా ప్రేమిస్తూ అవకాశాలని జారవిడుచుకోకుండా సినిమాలని చేస్తూ వెళ్తుంది కైరా అద్వానీ. త్వరలో కబీర్ సింగ్ అనే సినిమా తో ప్రేక్షకులని పలకరించనుంది ఈ హీరోయిన్. అర్జున్ రెడ్డి సినిమా కి రీమేక్ గా హిందీ లో వస్తున్న ఈ చిత్రం లో షాలిని పాండే చేసిన పాత్ర ని చేస్తుంది కైరా. ప్రస్తుతం చేతి నిండా సినిమాల తో బిజీ గా ఉన్న కైరా అసలు హీరోయిన్ గా ప్రయాణం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని ఇటీవల తన అనుభవాలని మీడియా తో పంచుకుంది.

ఈ గుర్తింపు తనకి రాత్రి కి రాత్రి రాలేదని, దాని కోసం ఎంతో కష్ట పడ్డానని చెప్పుకొచ్చింది కైరా. తన మొదటి చిత్రం ఫగ్లీ 2014 లో విడుదల అయింది. కాకపోతే ఆ సినిమా అప్పుడు పరాజయం పొందింది. అయినా కానీ కైరా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చాలా నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగి చివరికి ఎం ఎస్ ధోని సినిమా తో మరల లైమ్ లైట్ లో కి వచ్చింది. అయితే ఆ తర్వాత మెషిన్ అనే సినిమా చేసిన అది పెద్దగా గుర్తింపు తీసుకొని రాలేదు కానీ తర్వాత తెలుగు లో చేసిన భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలు మాత్రం మంచి గుర్తింపు ని తీసుకొని వచ్చాయి.

అయితే ఈ విషయాలన్నీ చెప్తూ హీరోయిన్ గా తమ ప్రయాణం లో చాలా బురద గుంతలు ఉంటాయి అని, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తే నే విజయం వరిస్తుంది అని చెప్పింది కైరా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -