కియారా అద్వానీ.. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. సోషల్ మీడియా లోనూ హావా కొనసాగిస్తూ మంచి క్రేజ్ సంపాధించుకుంది. హాట్ పిక్స్ షేర్ చేస్తూ.. తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ న్యూడ్ పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చింది.
విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కియారా.. తెలుగులో మహేష్, రామ్ చరణ్ సరసన నటించింది. మళ్లీ బాలీవుడ్ కి వెళ్లి బిజీ అయిపోయింది. గతేడాది ‘కబీర్ సింగ్’ సినిమాతో సక్సెస్ సాధించి ఆ తర్వాత అక్షయ్ కుమార్తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్ పట్టేసి బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది కియారా. ప్రస్తుతం ఈ అమ్మడు అదే అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీబాంబ్’ అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది.
అలానే లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇకపోతే తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది కియారా అద్వానీ. ఒంటి మీద నూలు పోగులేకుండా, కేవలం ఆకు చాటున అందాలను దాచి స్పెషల్ కిక్కిచ్చింది కియారా. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాను సెగలు పుట్టిస్తున్న ఈ పిక్ చూసి నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.