Thursday, April 25, 2024
- Advertisement -

నిర్మాత‌ల‌కు షాక్ ఇచ్చిన కైరా అద్వాని

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని , మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. మొదటి సినిమానే సూపర్ స్టార్ ది కావడం.. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ లో డిమాండ్ ఫుల్లుగా ఉంది. దీంతో త‌మ సినిమాల్లోకి ఆమెను తీసుకోవ‌డానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

సెకండ్ తెలుగు సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఈ భామ రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయింది. అమాంతం ఒక‌టే స‌రి కోటి రూపాయ‌ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు బెంబేలెత్తిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె చరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’ సినిమాలో చేసేసింది. అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా ఈ సుందరి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనే వార్త‌లు వ‌స్తున్నాయి. దాంతో ఆమె తన పారితోషికం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో గోపీచంద్ హీరోగా ‘గౌతమ్ నందా’ అనే సినిమాను నిర్మించిన దర్శకుడు సంపత్ నంది రెండో సినిమాను చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన హీరోయిన్ గా కియారా అద్వాని ని తీసుకుందామని అనుకున్నారట. ఫైనలైజ్ చేసుకునేందుకు సంప్రదింపులు జరిపితే రూ. 1.25 కోట్లు రెమ్యూనరేషన్ కోట్ చేసిందట. దీంతో నిర్మాతలు షాక్ తిన్నారట. చేసేదేమి లేక ఆమెకి అంత ఇచ్చుకోలేక మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. బన్నీ సినిమా తరువాత ఆమె పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -