Tuesday, April 23, 2024
- Advertisement -

తమిళ తంబిల కోసం అందాల ‘నిధి’

- Advertisement -

సవ్యసాచి సినిమా తో తెరంగేట్రం చేసి మిస్టర్ మజ్ను లో అఖిల్ సరసన నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్. మొదటి నుంచి ఒక పక్కా ప్రణాళిక తో తన సొంత పీ ఆర్ టీమ్ తో ముందుకు వచ్చిన ఈ భామ మెల్ల మెల్లగా ప్రేక్షకుల ని మాత్రం తన నటన తో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ హీరో గా వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న నిధి ఇప్పుడు ఏకంగా తమిళ సినిమా పరిశ్రమ పైన తన దృష్టి సారిస్తోంది. తెలుగు లో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన నిధి ఇక తమిళం లో కూడా తన అంధ చందాలని పంచాలనే ఉదేశ్యం తో ఉంది.

ఇప్పటికే కొంత మంది తమిళ దర్శకులు నిధి దగ్గరకి అవకాశాల తో వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే నిధి వరుసగా మూడు సినిమాలు ఒప్పుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి జయం రవి ప్రధాన పాత్ర లో వస్తూ ఉండగా మరో రెండు సినిమాల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇకపోతే నిధి ఇస్మార్ట్ శంకర్ విజయం పైన చాలా ఆశలే పెట్టుకుంది అని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -