Thursday, March 28, 2024
- Advertisement -

లాడ్జిలో హీరోయిన్ అలా.. కేస్ ఫైల్.. ఏం చేసింది ?

- Advertisement -

కోలీవుడ్ నటి విజయలక్ష్మీపై పోలీస్ కేసు నమోదైంది. కొన్ని నెలలుగా ఆమె వివాదాల్లో చిక్కుకున్న తాజాగా మరో కేసులో ఆమె చిక్కుకుంది. సీనియర్ హీరోయిన్ విజయలక్ష్మీపై దాఖలైన కేసు ఏమిటంటే.. తమిళ హీరోలు విజయ్, సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ అనే సినిమాతో విజయలక్ష్మీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. అయితే పలు సందర్భాల్లో రకరకాల సమస్యల్లో కూరుకుపోయి హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు.

అయితే ఇటీవలే ఓ రాజకీయ నాయకుడిపై విజయలక్ష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నామ్ తమీజర్ కచ్చి నేత సీమాన్‌తో నాకు అఫైర్ ఉంది. తనను వాడుకొని వదిలేశాడు. తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ఆరోపణలు చేయడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చిన ఈ నటి తిరువన్‌మియూర్ అనే లాడ్జిలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెడుతున్నారని సీమాన్‌‌పై భగ్గుమన్నది. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.

రాజకీయ నేత సీమాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో చెన్నైలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మరో వివాదానికి తెరలేపింది. రాజకీయ నేత సీమాన్‌తో గొడవ పక్కన పెడితే.. తిరువన్‌మియూర్‌లోని లాడ్జి యజమాని తాజాగా విజయలక్ష్మిపై పోలీస్ కేసు నమోదు చేశారు. కొద్దినెలలుగా తనకు అద్దె చెల్లించడం లేదు. దాదాపు 3 లక్షల రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఆమె నుంచి ఇప్పించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాడ్జి యజమాని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నాని తన సినిమా కి ఎందుకు ప్రొడ్యూసర్ ని మార్చాడు..?

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

బాలకృష్ణ సినిమా ని బోయపాటి శ్రీను ఇంత లైట్ తీసుకున్నాడా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -