కౌసల్య కృష్ణమూర్తి అనే పేరు తో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం లో ఐశ్వర్య రాజేష్ అరంగేట్రం చేస్తుంది. తమిళం లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఐశ్వర్య త్వరలో విజయ్ దేవరకొండ సరసన కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. ఈ సినిమా తమిళం లో వచ్చి విడుదల అయిన కనా అనే సినిమా కి రీమేక్. భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. ఈ సినిమా కి నిర్మాత కె ఎస్ రామారావు.
ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం జోరు గా సాగుతున్నాయి. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని నేడే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. క్రికెట్ నేపథ్యం గా సాగే ఈ చిత్రం లో ఐశ్వర్య దే ప్రధాన పాత్ర. ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లో మంచి ఎమోషన్స్ ఉన్నట్టు గా కనిపిస్తుంది.కచ్చితం గా ఈ సినిమా అందరినీ అలరించబోతుందని అవుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథి గా పాల్గొననున్నారు.