Saturday, April 20, 2024
- Advertisement -

మీడియాపై సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత

- Advertisement -

టాలీవుడ్ లో పేరుమోసిన నిర్మాతలలో కేఎస్ రామారావు కూడా ఒకరు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఇప్పటికె బోలెడు క్లాసిక్ సినిమాలను నిర్మించారు. ఆయన నిర్మించిన చంటి, మాతృదేవోభవ, అభిలాష, చాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం మొదలగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ తాజాగా ఆయన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా ని విడుదల చేశారు. అయితే ఈ సినిమా వేడుకలో మాట్లాడుతూ మీడియా వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కె.ఎస్.రామారావు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్వెన్షన్ సెంటర్ లో చోటుచేసుకోకుండా విజయ్ దేవరకొండ మరియు రాశీ ఖన్నా లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

ఆ వేడుకలో మాట్లాడుతూ “మా సినిమా అయితే సినిమా కాదా? అన్ని సినిమాలు లైవ్ ఇస్తున్నారు కానీ సినిమాకి మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ కేఎస్ రవికుమార్ మండిపడ్డారు. ముఖ్యంగా ఒక రెండు ప్రముఖ ఛానల్స్ పై కె.ఎస్.రామారావు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఇలాంటి మీడియా పక్షపాతం చూపించటం ఏమాత్రం బాగలేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకి మీడియా అవసరం ఎక్కువగా ఉంటుందని అలాంటి సినిమాలను మీడియా సైతం సపోర్ట్ చేయాలని ఆయన పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -