తెలుగులో స్టార్ హీరోయిన్కు రెమ్యునరేషన్ మహా అయితే కోటిన్నర. కేరీర్లో మంచి పీక్ లో ఉన్నప్పుడు సమంత 2 కోట్ల రూపాయలు తీసుకుంది. అంటే ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. కానీ అంత రెమ్యునరేషన్ లేదు. ఇక తమిళ్లో నయనతార కూడా 2 కోట్లు రూపాయలు తీసుకుంటోంది. కానీ సౌత్ లో 5 కోట్లు పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఉన్నారు. ఎవరంటే సమాధానం మంచు లక్ష్మీ. అవును.. ఆమె ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది.
జీ5 యాప్ కోసం మిసెస్ సుబ్బలక్ష్మీ అనే వెబ్ సిరీస్ చేసింది మంచు లక్ష్మీ. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె అక్షరాలా 5 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ను అందుకుంది. నిజానికి ఈ ప్రాజెక్టుకు అన్నీ తానై వ్యవహరించింది మంచు లక్ష్మీ. నటించడంతో పాటు నిర్మాణం పనులు కూడా చూసుకుంది. పైగా ఇది సినిమా కాదు. దాదాపు 6 భాగాల్లో వచ్చే సిరీస్. అందుకే ఆమెకు ఇంత రెమ్యునరేషన్.
ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణంతో కలుపుకొని 6 ఎపిసోడ్లకు ఇది తక్కువ మొత్తమే. కానీ అదంతా తన రెమ్యూనరేషన్ కిందే లెక్కేసింది మంచు లక్ష్మి. అవసరాల శ్రీనివాస్ కూడా ఇందులో నటిస్తున్నారు. సుబ్బలక్ష్మి పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తే, సుబ్రమణ్యం పాత్రలో అవసరాల కనిపించనున్నారు.