వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాను తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే సినిమాను జనాలలోకి బాగానే తీసుకువెళ్లాడు. ట్రైలర్, వీడియో సాంగ్స్ అంటూ తన మార్క్ పబ్లిసిటీ చేసి సినిమాకు హైప్ తెచ్చాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ను విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్రైలర్లో చంద్రబాబు ఎన్టీఆర్ను ఎలా నమ్మించి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడో చూపించారు.
లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎంత నీచంగా చూసే సన్నివేశాలను ట్రైలర్లో చూపించారు. పార్టీ కోసం నేను తీసుకునే నిర్ణయానికి అండగా ఉండలని చంద్రబాబు హరికృష్ణను కోరే సన్నివేశాన్ని కూడా మనం ఈ ట్రైలర్లో చూడవచ్చు.
లక్ష్మీ పార్వతి తో ఫోన్లో మాట్లాడుతు నా కొడుకు లోకేశ్ మీద ఒట్టు అనే సీన్ ట్రైలర్కే హైలేట్ అని చెప్పాలి. మొదటి ట్రైలర్లాగే రెండో ట్రైలర్ కూడా చంద్రబాబునే మరోసారి టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కనుక విడుదల అయితే ఎన్ని వివాదాలు సృష్టిస్తోందో చూడాలి.
- Advertisement -
చంద్రబాబుపై మరో ట్రైలర్ను వదిలిన రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -