లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వెయిటెడ్ మూవీ. వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాను తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే సినిమాను జనాలలోకి బాగానే తీసుకువెళ్లాడు. ట్రైలర్, వీడియో సాంగ్స్ అంటూ తన మార్క్ పబ్లిసిటీ చేసి సినిమాకు హైప్ తెచ్చాడు రామ్ గోపాల్ వర్మ. నిన్న విడుదల చేసిన రెండో ట్రైలర్తో సినిమాను మరో లేవల్కు తీసుకువెళ్లాడు రామ్ గోపాల్ వర్మ. ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న వర్మ సినిమా గురించి మాట్లాడారు.
ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని, అలాగే, ఏ సినిమా అయినా, తొలి స్ఫూర్తి ఇవ్వడానికి ఒకరుంటారని, అక్కడి నుంచి మొదలయ్యే ఆలోచనే సినిమా అవుతుందని, వర్మ చెప్పారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు సమయంలో నేను ఇక్కడ లేనని, బాలీవుడ్లో రంగీలా సినిమా చేస్తున్నానని తెలిపాడు. ఆ సమయంలో ఏం జరిగిందో సరిగ్గా నాకు తెలియదని ,బయోపిక్ తీద్దామని ఫిక్స్ అయినప్పుడు అన్ని విషయాలను తెలుసుకున్ననని చెప్పుకొచ్చాడు.తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీయాలన్న ఆలోచన రావడానికి నందమూరి బాలకృష్ణ స్ఫూర్తినిచ్చారని, అందుకే ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
- Advertisement -
లక్ష్మీస్ ఎన్టీఆర్ను బాలయ్యకు అంకింతం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -