సినిమా వాళ్లకు రాజకీయలకు విడదీయరాని సంబంధం ఉంది. పలు సినిమా వారు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వారుకూడా ఉన్నారు. ఎన్టీఆర్ ఏమ్జీఆర్, జయలలిత వంటి వారు తమ రాష్ట్రాలకు సీఎంలుగా పని చేశారు. తాజాగా ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు రంగం సిద్దం అయిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులు ప్రకటించాయి. ఎన్నికల సమయంలో సినీ గ్లామర్కు ఓట్లు పడతాయని చాలాసార్లు నిరుపితమైంది. సినిమా వారు కూడా ఎన్నికల సమయంలో తమకు నచ్చిన పార్టీల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎన్నికల బరిలో దిగుతోంది. హీరోయిన్ ,మోడల్ నిషా యోగేశ్వర్ బీజేపీ పార్టీ తరుపున బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీ అయింది. ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిషాకు ఆ స్థానంను కేటాయించాలని అధిష్టానం సైతం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. నిషా యోగేశ్వర్ వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలే. ఆమె కనుక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్లమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. గతంలో తండ్రి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిషా మంచి స్పీచ్ లతో అదరగొట్టింది. అందుకే ఈ సారి ఆమెను పార్లమెంటు బరిలో దించేందుకు స్థానిక బీజేపీ నాయకులు భావిస్తున్నారు.