Friday, March 29, 2024
- Advertisement -

సింగర్ సునీత పేరు చెప్పి రూ.1.7 కోట్లు కొన్నారు..!

- Advertisement -

కొందరు దుండగులు ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పుకోని ఓ అభిమాని నుంచి రూ.1.7 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన మహిళ(44)కు సింగర్ సునీత అంటే ఎంతో అభిమానం. ఆమె పాటలు అంటే చాలా ఇష్టమట. ఈ విషయం తెలుసుకున్న అదే ప్రాంతంలోని చైతన్య అనే వ్యక్తి.. తన దగ్గర సింగర్ సునీత నెంబర్ ఉందని చెప్పి ఆ మహిళను నమ్మించాడు. దాంతో ఆమె రెండు మూడు సార్లు సింగర్ సునీతకి వాట్సప్ లో మేసేజ్ చేసింది.

అప్పుడు ఆ నెంబర్ ని బ్లాక్ చేశారు. దాంతో మరో నెంబర్ నుంచి వాట్సాప్ కి మెసేజ్ చేసి క్షమించాలని కోరింది. అటువైపు నుంచి సరే అంటూ సమాధానం వచ్చింది. అప్పటి నుంచి చాటింగ్ కొనసాగింది. కేరళ లోని ‘ఆనంద చెర్లాయం’లో రూ. 50 వేలు సభ్యత్వం కట్టి చేరాలని ఓ రోజు మెసేజ్ రాగా ఆ అభిమాని ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేసింది. డబ్బు అవసరం ఉండీ.. అమెరికాలోని భూమి అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటూ నమ్మించి.. మొత్తం రూ.1.7 కోట్లు వసూలు చేశారు.

అయితే వాట్సాప్ లో వీడియో కాల్ కు మాత్రం అంగీకరించకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకు సింగర్ సునీత నెంబర్ ఇచ్చిన వ్యక్తే ఇదంతా చేస్తున్నారని గ్రహించి అతడితో పాటు మరికొంతమంది పై ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై సునీత స్పందించింది. తన పేరు చెప్పి కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని తెలిసిందని.. ఎవరైనా తన పేరును ఉపయోగించుకుని డబ్బులు వసూళ్లు చేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయిందాలని సూచించింది. ఎవరైనా తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటే అసలు నమ్మొద్దని చెప్పింది.

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్.. ఎందుకు ?

అలా కిస్ చేయడం వల్ల భర్త మీద కోరిక కలిగింది : యాంకర్ ఝాన్సీ

ఛాన్స్ ఇస్తానని పిలిచి.. రూంలోకి తీసుకెళ్లాడు : ఫన్ బకెట్ భార్గవి

టెంపర్ మూవీని ఆర్.నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -