Tuesday, April 23, 2024
- Advertisement -

దేశాన్ని గర్వపడేలా చేస్తున్న స్టార్ కిడ్

- Advertisement -

ఒక నటుడిగా ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారిన సౌత్ స్టార్ ఆర్ మాధవన్ ఒక తండ్రిగా చాలా గర్వపడే సందర్భం వచ్చింది. దేశం కోసం తన కొడుకు సాధించిన విజయానికి మాధవన్ పుత్రోత్సాహంతో ఉన్నారు. దానికి కారణం మాధవన్ కొడుకు తనయుడైన వేదాంత్. ఏషియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ ని అందుకున్న వేదాంత్ గత కొంత కాలంగా స్విమ్మింగ్ పోటీల్లో తన సత్తా చాటుతూనే వచ్చాడు. తాజాగా ఈ యువ కెరటం మొన్న జరిగిన ఫైనల్స్లో 4×100 స్విమ్మింగ్ రిలే లో రజత పతకాన్ని సాధించి కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని గర్వపడేలా చేశాడు.

ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొని సంతోషించారు మాధవన్. “ఇది నాకు మరియు నా భార్య సరితకి చాలా గర్వపడదగ్గ విషయం. మా వేదాంత్ ఇవాళ థాయిలాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్ మీట్ లో ఇండియా కి మొదటి మెడల్ ని తీసుకు వచ్చాడు. మీ అందరి ఆశీర్వాదాలకి నా కృతజ్ఞతలు” అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు మాధవన్. ఇక సినిమాల పరంగా చూస్తే మాధవన్ మరియు అనుష్క ముఖ్య పాత్రల్లో ‘నిశబ్దం’ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -