Wednesday, April 24, 2024
- Advertisement -

ప‌వ‌న్ పిలిస్తే జ‌న‌సేన‌లోకి వెళ్తాను: మాధ‌వీల‌త‌

- Advertisement -

హీరోయిన్ మాధ‌వీలత కొన్ని సినిమాల‌లో న‌టించింది.త‌రువాత ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో రాజ‌కీయల‌లో ఎంట్రీ ఇచ్చింది.మాధవీలత ఇటీవలే బిజేపీ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.అయితే ఆమె ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అభిమానం అని తెలిపింది. కానీ రాజకీయాలకి వచ్చేసరికి మాత్రం ఆమె పవన్ జనసేన పార్టీ కాకుండా బీజేపీలో చేరింది. బీజేపీలో ఉన్నప్పటికీ పవన్ మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గదని అంటోంది మాధవీలత.

చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో అభిమానించేదాన్నని.. ఆ తరువాత పవన్ వ్యక్తిత్వం, ఆలోచన విధానం పట్ల ఆకర్షితురాలినయ్యానంటూ చెప్పుకొచ్చింది. అయితే పవన్ పిలిస్తే జనసేనలో జాయిన్ అవుతారా..? అనే ప్రశ్నకి సమాధానంగా.. పవన్ నుండి పిలుపు వస్తే మాత్రం జనసేన విషయమై ఆలోచిస్తానని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -