Thursday, April 25, 2024
- Advertisement -

మణిరత్నం టైటిల్ ని కొట్టేసిన కీర్తి సురేష్

- Advertisement -

మహానటి అందించిన విజయం తరువాత కీర్తి సురేష్ క్రేజ్ కి హద్దు లేకుండా పోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తి సురేష్ ఇప్పుడు అగ్ర నటి. వరుస సినిమాలతో పాటు వరుస విజయాలు కూడా అందుకుంటున్న ఈ నటి తెలుగు లో మహానటి తరువాత చేస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యం లో నరేంద్ర దర్శకుడి గా వస్తున్న ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్ ని పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే విషయం పై ఇప్పటికీ అధికార ప్రకటన లేకపోయినప్పటికి మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం మణిరత్నం అప్పట్లో తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన సఖి అనే టైటిల్ ని ఈ సినిమా కి పెట్టనున్నారు అట. ఇప్పటికే సఖి అనే టైటిల్ ని ఫిలిమ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారట నిర్మాత. ఇక పోతే సఖి ఎంతటి విజయం సాధించిందో కీర్తి సురేష్ సఖి కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.

రాజేంద్ర ప్రసాద్, కమల్ కామరాజు, నదియా, భాను శ్రీ మెహ్రా, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నారు. నరేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -