మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా మే 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్టైంది. దీంతో చిత్రబృదంలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా విజయానందంలో మహర్షిటీమ్ సినిమా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. బెజవాడ సిద్ధార్థ కాలేజి గ్రౌండ్ మహర్షి విజయోత్సవ వేడుకలకు ఆతిథ్యమివ్వనుంది.ఈ సభకు వేలాదిమంది అభిమానులు హాజరవుతారని సమాచారం
హీరో మహేశ్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.ఇవాళ మధ్యాహ్నం విజయవాడ విచ్చేసిన మహేశ్ బాబు తదితరులు ముందుగా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలోకి ప్రవేశించిన మహర్షి టీమ్ కు ఆలయవర్గాలు సంప్రదాయరీతిలో స్వాగతం పలికాయి.పూజాదికాలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు మహేశ్ బాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి సిద్దార్ధ కళాశాలలో జరిగే విజయోత్సవ సభకు హాజరవుతారని సమాచారం.