Friday, March 29, 2024
- Advertisement -

“నీకెందుకు మహేష్ ఆ రిస్క్” అంటున్న అభిమానులు

- Advertisement -

నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా మహేష్ బాబు కొత్త చిత్రం ‘సరిలేరు నీవెవ్వరు’ చిత్రం ఘనం గా ఆరంభం అయింది. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా కి ముగ్గురు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ముందు నుండి అనుకుంటున్నట్లు గా నే ఈ సినిమా ని అనిల్ సుంకర మరియు దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే పోస్టర్ మీద జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ లోగో కూడా ఉండటం తో మహేష్ కూడా ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు అని అర్ధం అవుతుంది. అయితే ఇదే బానర్ మీద మహేష్ ఇంతకు ముందే రెండు సినిమా లు చేసాడు కానీ అందులో డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకున్న సంగతి అందరికీ తెలుసు.

ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ అభిమానులు కొందరు మహేష్ కి ఈ ప్రొడక్షన్ రిస్క్ ని అవైడ్ చేయమని సలహాలు ఇస్తున్నారు. మహేష్ చక్కగా యాక్టింగ్ మీద ధ్యాస పెడితే చాలు, అనవసరం గా నిర్మాణం జోలికి మరలా వెళ్లడం అవసరం లేదు అనేది వారి వాదన కానీ మహేష్ కి కథ నచ్చి తప్పకుండా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉండటం తో ఇలా నిర్మాత గా ఉంటూ పారితోషికం బదులు లాభాలు తీసుకోవాలనే ఆలోచన తో ఈ పని చేసాడట.

ఇప్పటికి అయితే అచ్చి రాని నిర్మాణం మరి ఈ సినిమా తో ఏమైనా మారుతుందా అనేది .వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -