Thursday, April 25, 2024
- Advertisement -

అతని కోసం ఎదురుచూడనున్న మహేష్ బాబు, అనిల్ రావిపూడి

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంద. అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ‘రంగస్థలం’, ‘ఖైదీనెంబర్150’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు ని తీసుకోవాలని చిత్రబృందం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

అయితే రత్నవేలు ప్రస్తుతం ‘సైరా’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ అనిల్ రావిపూడి రత్నవేలు కోసం వెయిట్ చేయాలని అనుకుంటున్నాడట. జూన్ ఆఖరు కల్లా ‘సైరా’ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ కి కూడా సినిమాటోగ్రాఫర్గా పనిచేయమని రత్నవేలు ని అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన డి.ఐ పనులలో సెప్టెంబర్ లో పాల్గొనబోతున్న రత్నవేలు కుదిరితే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ లో రెండు షెడ్యూల్స్ లో పని చేయబోతున్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -