Tuesday, April 23, 2024
- Advertisement -

ప్యాన్ ఇండియా రేసులోకి మహేష్ బాబు..

- Advertisement -

ప్యాన్ ఇండియా రేసు. మన టాలీవుడ్ హీరోలంతా కలలుగనే అవకాశమిదీ.. దీనికోసం ఎంతో మంది ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్లడం లేదు.

ఇక మహేష్ బాబు సైతం తమిళనాట ‘స్పైడర్’ మూవీతో అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ కావడంతో తిరిగి చూడలేకపోయాడు.

ఇక ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసిన ఘనత ఖచ్చితంగా రాజమౌళిదే. బాహుబలి సినిమా దెబ్బకు ఓవర్ నైట్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తరువాత తీసిన ‘సాహో’ సినిమా ఫర్వాలేదనిపించింది.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలతో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా ప్యాన్ ఇండియా స్టార్లు కావడం ఖాయం. రాజమౌళి వారిని ఖచ్చితంగా జాతీయ హీరోలుగా నిలబెడుతారన్న గ్యారెంటీ ఉంది.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఇప్పటికే దక్షిణాదిన మార్కెట్ కలిగి ఉన్నారు. తెలుగు, మలయాళంలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తమిళం, కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. సుకుమార్ తో తీయబోయే ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట..

ఇక మహేష్ బాబు ప్యాన్ ఇండియా స్టార్ రేసులోకి వచ్చాడు. రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తీయబోయే చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి మహేష్ ఎంట్రీ ఘనంగా కావడం ఖాయం. ఇప్పటికే యాడ్స్ తో దేశమంతా ఫ్యాన్స్ ఉన్న మహేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా రాజమౌళి సాయంతో ఘనంగా వెళుతున్నాడు. అక్కడ క్లిక్ అయితే ఇక తిరిగి చూసుకునే అవకాశం మహేష్ కు ఉండదు. 2022లోనే మహేష్ బాబు ప్యాన్ ఇండియా కల నెరవేరే చాన్స్ కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -