Tuesday, April 23, 2024
- Advertisement -

సరిలేరు టీంకి పార్టీ ఇచ్చిన మహేష్, నమ్రత..!

- Advertisement -

జనవరి 5న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరై సరిలేరు నీకెవ్వరు తన బెస్ట్ విషెస్ ని తెలియజేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా ఈవెంట్ లోనే చిరంజీవి గారు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో మహేష్ బాబు తన అభిమానుల కోసం ఓ మాస్ సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఓ మాస్ సబ్జెట్ తో అనిల్ రావుపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, ట్రైలర్ కు విపరితమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సినిమాపై ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఉన్నారు. దాదాపు సినిమా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయ్యేలా ఉంది. మహేష్ సరసన రష్మీక హీరోయిన్ గా చేస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. అయితే నిన్న జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్ తర్వాత సరిలేరు నీకెవ్వరు టీంకు మహేష్ బాబు నమ్రత తమ ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో విజయశాంతి, సంగీత. అనిల్ రావిపూడి, తమన్నా, దేవి శ్రీ ప్రసాద్, రష్మీక, వంశీ పైడిపల్లి, అనిల్ సుంకర తో పాటు మరికొంతమంది నటులకు కూడా హాజరై సందడి చేశారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -