మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తీస్తున్న మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మొదట మహేష్ బాబు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబు అధిక పారితోషకం డిమాండ్ చేయడం వల్ల అది కార్యరూపం దాల్చలేదని సమాచారం.
అయితే చిరంజీవీ ఎప్పుడూ మహేష్ బాబును అతిథి పాత్ర కోసం సంప్రదించలేదని ఆ యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో మహేష్ బాబు నటిస్తున్నారనే వార్తలు ఎలా లీక్ అయ్యాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇక దర్శకుడు కొరటాల శివ సైతం ‘ఆచార్య’ చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం రాంచరణ్ ను పేరును తానే సూచించానని ఇటీవల తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ తో రాంచరణ్ బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ సమస్య వచ్చిందన్నారు. ఇక చరణ్ బిజీగా ఉండడం వల్ల మహేష్ బాబుతో కొరటాల మాట్లాడినట్టు తెలిసింది. మహేష్ కూడా దీనికి ఓకే అన్నాడని కొరటాల సన్నిహితులతో చెప్పుకున్నాడట.. అది మీడియాకు చేరి రచ్చ రచ్చ అయిపోయిందట..
కొరటాలతో మహేష్ బాబుకు మంచి సంబంధాలున్నాయి. అయితే స్టార్ హీరో కావడం.. కేవలం అతిథి పాత్ర చేస్తే స్టార్ స్టేటస్ కు ఇబ్బంది అని వైదొలిగినట్టు తెలిసింది. దీంతో రాంచరణ్ ను చివరకు ఫిక్స్ చేసినట్టు తెలిసింది.