టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు అంటే చాలు అమ్మాయిలు పిచ్చేక్కిపోతారు.40 సంవత్సరాలు దాటిన ఇప్పటికి చెక్కు చెదరని అందం మహేశ్ది. మహేశ్ అంటే బాలీవుడ్ భామలు సైతం ఇష్టపడతారు.మరి అలాంటి మహేశ్ ఓ ఛానెల్లో ప్రసారమయ్యే టీవీ ఆర్టిస్ట్పై మోజు పడినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మా టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్లో నటిని ఇష్టపడుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ సీరియల్ హీరోయిన్గా చేస్తున్న దీపాగా నటించే అమ్మాయి యాక్టింగ్కు మహేశ్ ఫిదా అయ్యాడట. దీంతో ఆ అమ్మాయికి తన సినిమా పిలిచి మరి అవకాశం కల్పించారని సమాచారం.
మా టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఈ సీరియల్ను చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే మహేశ్ అసలు సీరియల్ చూడటం ఏంటీ? చూసిన కాని సీరియల్ నటి నచ్చడం ఏంటో అని కొందరు వాదిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి మహేశ్ సినిమాలో సీరియల్ నటి నటిస్తే అది గొప్ప విషయమే అని చెప్పాలి.. మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.