Saturday, April 20, 2024
- Advertisement -

మళ్ళీ విదేశాలకి చెక్కేస్తున్న మహేష్

- Advertisement -

మహర్షి సినిమా విజయం సాధించిన అనంతరం అభిమానుల ఆశలు అన్ని రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని మరింత ఆసక్తికరం గా మార్చే దిశగా చూస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమా మహర్షి ప్రచార పనుల్లో బిజీ గా గడుపుతున్నాడు. మహర్షి సినిమా విజయం మహేష్ కి అత్యంత కీలకం. ఈ సినిమా తన కెరీర్ లో ఒక మైలురాయి చిత్రం కావడం తో ముందు నుంచే విజయం కాంక్షించారు అంతా. ఇప్పుడు సినిమా విజయం తో చిత్ర యూనిట్ తో పాటు మహేష్ కూడా త్యంత సంతోషం గా ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం మేరకు మహేష్ బాబు కుటుంబ సభ్యుల తో ప్రస్తుతం ఒక ఫారిన్ ట్రిప్ వేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ ముందు ఒక ట్రిప్ వేసి వచ్చిన మహేష్ ఈ సారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మరలా ఇంకో ట్రిప్ కి వెళ్లనున్నట్లు సమాచారం.

మరో రెండు రోజుల్లో మహేష్ ఈ ట్రిప్ ను మొదలు పెట్టనున్నాడట. తిరిగి వచ్చాక వెంటనే అనిల్ రావిపూడి సినిమా పనులు ప్రారంభం చేసేలా ప్లాం చేస్తున్నట్లు తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=tsLsDAjVHxk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -