Friday, March 29, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లం రికార్డుల‌పై క‌న్నేసిన మ‌హ‌ర్శి…200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు

- Advertisement -

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ‘మహర్షి’ ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంద‌రూ అనుకున్న‌ట్లుగానె రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ వాటినన్నింటినీ తట్టుకుని బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రైతుల సమస్యలకి సంబంధించిన కథ కావడంతో, సాధారణ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమా 4 రోజుల్లోనే 102.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ చిత్రం మహేశ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 8 రోజుల్లో ఈ సినిమా 150.45 కోట్లను రాబట్టిందనేది తాజా సమాచారం

మూడోవారంలోనూ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహర్షి’ తాజాగా ‘రంగస్థలం’ రికార్డుపై కన్నేశాడు. రామ్‌చరణ్ కెరీర్లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ నైజాం ఏరియాలో రూ.27.76కోట్లు షేర్ రాబట్టింది.నైజాంలో గురువారం రూ.84లక్షలు రాబట్టిన ‘మహర్షి’ ఓవరాల్‌ కలెక్షన్లు రూ.22.05కి చేరాయి.

నైజాం ఏరియాలో బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు హయ్యెస్ట్ షేర్ కలెక్షన్లో టాప్లో ఉన్నాయి. వాటి తర్వాతి స్థానంలో ‘మహర్షి’ చేరడం పక్కాగా కనిపిస్తోంది. కలెక్షన్లు స్టడీగా ఉంటే మూడో వారం ముగిసేసరికి రంగస్థలాన్ని దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -