Thursday, March 28, 2024
- Advertisement -

‘సాహో’ నిర్మాతలపై మండి పడుతున్న మహేష్ బాబు హీరోయిన్

- Advertisement -

ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా ఎట్టకేలకు ఆగస్ట్ 30 న విడుదలైంది. శ్రద్ధా కపూర్, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, అరుణ్ విజయ్, మందిరా బేడి వంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ రెస్పీన్స్ అందుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవైపు కలెక్షన్లు తగ్గిపోతుండగా మరోవైపు సినిమా తాజాగా ఒక వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమా లో ‘బేబీ వొంట్ యూ టెల్ మీ’ పాట పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న డిజైన్ నీ సాహో దర్శకనిర్మాతలు కాపీ కొట్టారు అంటూ ఒక బాలీవుడ్ నటి సాహో మేకర్స్ పై మండి పడుతోంది. ఆమె లిసా రే.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ’ సినిమాలో కనిపించిన లిసా రే ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సాహో పోస్టర్ని పోస్ట్ చేస్తూ డిజైన్ షైలో శివ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించారని కానీ సాహో నిర్మాతలు ఆమె కి కనీసం క్రెడిట్ ఇవ్వలేదని మండిపడ్డారు. భారీ సినిమాని తెరకెక్కించిన నిర్మాణ సంస్థ ఇలా వేరొకరి పనితనాన్ని దొంగిలించడం అసలు కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. ” తన ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు ప్రభాస్ (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె క్రియేటివిటీ ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దైవంగా భావిస్తారు. వారి ప్రతిభను దొంగలించకూడదు” అని చెప్పిన లిసా ఈ విషయంపై సాహో చిత్రబృందం స్పందించాల్సి ఉందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -