Friday, March 29, 2024
- Advertisement -

శ్రీముఖే టైటిల్ విన్నార్ : మహేశ్ విట్టా కామెంట్స్

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలను బిగ్ బాస్ మూడో సీజన్ బాగానే అలరిస్తోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ బిగ్ బాస్ లో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. అయితే ఎలిమినేషన్ ద్వారా ఇంటి నుంచి బయటకు వచ్చిన సభ్యులు బిగ్ బాస్ గురించి, ఇంటి సభ్యుల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు చేస్తున్న వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. ఇటీవలే ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా తాజాగా బిగ్ బాస్ నిర్వాహకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ నిర్వాహకులు కొందరు పక్షపాతం చూపిస్తున్నారని అన్నాడు. యాంకర్ శ్రీముఖికి మాత్రమే పేవర్ చేస్తూ శ్రీముఖీ హౌస్ లో ఉండేలా సహాయం చేస్తున్నారు అంటూ మహేష్ విట్టా సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా శ్రీముఖి ఒక వేళ బిగ్ బాస్ విన్నర్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు.

అయితే అంతకు ముందు హౌస్ నుంచి బయటకు వచ్చిన నటి హిమజా కూడా బిగ్ బాస్ శ్రీముఖికి హెల్ప్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. శ్రీముఖిని టైటిల్ విన్నర్ గా ప్రేక్షకుల్లో చూపించడానికి.. ఎపిసోడ్ లో ఆమెనే ఎక్కువగా చూపిస్తున్నారని హిమజా కామెంట్ చేసింది. మహేశ్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. కానీ కొందరు మాత్రం రాహుల్ మాత్రమే టైటిల్ విన్నర్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -