బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ రాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
క్లాసికల్ డ్యాన్సర్, మోడల్ అయిన ప్రయాగ మార్టిన్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసి.. ఆ తర్వాత హీరోయిన్గానూ మెరిసింది. తమిళంలో ‘పిశాచి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఉస్తాద్ హోటల్ మూవీలోనూ కనిపించింది. త్వరలో మొదలు అవ్వబోతున్న షెడ్యూల్ పై ప్రయాగపై సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్న ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.
శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!
పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?