నందమూరి తారక రామారావు జీవిత కథను ఎన్టీఆర్ పేరుతో తెరకెకక్కిస్తున్నాడు ఆయన తనయుడు హీరో బాలకృష్ణ.ఈ బయపిక్కు దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్. ఈ సినిమా కోసం వీలైనంత వరకు సినిమాలో నటీనటులనే ఎంపిక చేసుకుంటున్నాడు. కొత్తవారు పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానా – రకుల్ ప్రీత్ సింగ్ -విద్యాబాలన్ – సుమంత్ – కళ్యాణ్ రామ్ వంటి వారు సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
అసలు విషయంలోకి వస్తే చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఆయన సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళం హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్గా చేసిన మంజిమా మోహన్ని ఈ సినిమాలో తీసుకున్నారట.చంద్రబాబు భార్య పాత్రను కూడా సినిమాలో కీలకం కానుండడంతో మంజిమ మోహన్ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.