టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మీటు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరగుతున్న లైంగక వేదింపులు గురించి ఈ మీటు ఉద్యమం మొదలైంది. ఇలా మీటూ ఉద్యమం గురించి ధైర్యంగా బయటికి చెప్పిన ఓ లేడీ డైరెక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి సంచనలనంగా మారింది. మలయాళం ఇండస్ట్రీకి చెందిన సూర్యన్ అనే మహిళా దర్శకురాలు ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించింది. ఆమె పలువురు స్టార్ దర్శకుల దగ్గర శిష్యరికం చేసింది. ఒక సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన రెండో సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది.
ఈలోపే ఆమె ఇలా విగత జీవిగా దర్శనమిచ్చింది. అయితే ఆమె మరణం వెనుక ఏదో కుట్ర దాగి ఉందేమో అని చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులుపై మీటూ ఆరోపణలు చేసింది. సాక్ష్యలు కూడా తన దగ్గర ఉన్నాయాని, సమయం వచ్చినప్పుడు వాటిని బయపెడతానని తెలిపింది. అలా చెప్పిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. దీంతో ఆమె మరణం వెనక ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు.సూర్యన్కు కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం కేరళలో నివసిస్తోంది.అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వారి విచారణ మొదలుపెట్టారు.
- Advertisement -
‘మీటూ ఆరోపణలు’ చేసిన లేడీ డైరెక్టర్ అనుమానాస్పద మృతి
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -