హీరో మంచు మనోజ్ చేతితో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. గత కొంతకాలం నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే అభిమానులకు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మనోజ్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలలో మంచు మనోజ్ కూడా ఒకరు. సమాజంలో జరుగుతన్న వాటిపై ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటాడు మనోజ్. మొన్నటి మొన్న ప్రధాన మంత్రి మోదీపై కామెంట్స్ చేశాడు. ఇక రెండు రోజులు క్రితం హైదరాబాద్ బర్కతపూరలో మధులికపై జరిగిన ప్రమాదంపై కూడా స్పందించాడు మంచు మనోజ్. మనం ఎలాంటి సమాజంలో బ్రతుకున్నామో తెలుసుకోవాలని తెలిపాడు. మన ఇంట్లో ఆడవాళ్లను తలుచుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని తన ట్విట్టర్లో పెర్కోన్నాడు మనోజ్.
తాజాగా ఈ రోజు(శుక్రవారం) నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కామెంట్స్ చేశాడు మంచు మనోజ్. పవన్ సర్ తన పార్టీలో అందరికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీలో ఉన్నత విద్యావంతులు చేరడం మంచి పరిణామం అని మనోజ్ తెలిపాడు.ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటే దానికొక విలువ, అర్ధం ఉంటుంది.వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ చూసిన పవన్ అభిమానులు మంచు మనోజ్పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మరి కొందరు అయితే నీలాంటి వారు పార్టీకి అవసరం ఎంతో ఉంది , మీరు మన జనసేనలో చేరండి అని కోరుతున్నారు.
- Advertisement -
పవన్ జనసేనపై సంచలన కామెంట్స్ చేసిన మంచు మనోజ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -